Saturday, October 5, 2024
HomeతెలంగాణSerilingampalli: పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్

Serilingampalli: పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్

పరిస్థితిని స్వయంగా సమీక్షించిన స్టీఫెన్ రవీంద్ర

తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరణిని పరిశీలించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, గౌలిదొడ్డి, నానక్రాంగూడ కాలనీ, కే పి హెచ్ బి కాలనీ, గోపనపల్లి హఫీజ్ పేట్, లంబాడి తండా, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిశీలించారు.

- Advertisement -

మాదాపూర్, బాలానగర్ జోన్ పరిధిలోని కె పి హెహ్ బి కాలనీలో గల మలేషియా టౌన్ షిప్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. అలాగే కుత్బుల్లాపూర్, నిజాంపేట్ లో గల జడ్పీహెచ్ఎస్ స్కూల్ లలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను కూడా కమిషనర్ సందర్శించారు. నానక్రాంగూడ, గౌలిదొడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను కూడా పరిశీలించారు.న్యూ హఫీజ్ పేట్ లోనీ ఆదిత్య నగర్ లో గల న్యూ హోలీ స్కూల్ లో కూడా పోలింగ్ సరళిని పరిశీలించారు.

గోపనపల్లి తండాలోని ఎంఎంపిఎస్ పాఠశాలను కూడా పోలీస్ కమిషనర్ సందర్శించారు. పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సైబరాబాద్ లోగల కమాండ్ అండ్ కంట్రోల్ సెంట్రల్ లోని పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న క్యూఆర్డి వాహనాలకు అమర్చిన జిఐఎస్ వ్యవస్థ నుంచి రియల్ టైం లొకేషన్ ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలించారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వెంట మాదాపూర్ డిసిపి సందీప్, బాలానగర్ డిసిపి శ్రీనివాసరావు, ఏసీపి మాదాపూర్ శ్రీనివాస్, ఏసిపి బాలానగర్ గంగారం, బాచుపల్లి ఇన్స్పెక్టర్ సుమన్, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ పవన్, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ జేమ్స్ బాబు, కే పి హెచ్ బి ఇన్స్పెక్టర్ వెంకటేష్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News