Friday, September 20, 2024
HomeతెలంగాణShadnagar: మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతాం

Shadnagar: మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతాం

కొత్తూరు మున్సిపాలిటీని ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం

రోడ్ల అభివృద్ధికి బిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో స్టేషన్ తిమ్మాపూర్, కుమ్మరిగూడలో సిసి రోడ్ పనులకు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొత్తూరు మున్సిపాలిటీ అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని తెలిపారు. రాబోయే రోజుల్లో కొత్తూరు మున్సిపాలిటీని రాష్ట్రంలోని ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ డోలి రవీందర్, మున్సిపల్ కమిషనర్ వీరేందర్, కౌన్సిలర్స్ మాధవి గోపాల్ గౌడ్, జండగూడెం అనిత శ్రీనివాస్ గౌడ్, కమ్మరి జయమ్మ జనార్ధన చారి, మాదారం నరసింహ గౌడ్, ఎంపీటీసీ రాజేందర్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మె సత్యనారాయణ, మాజీ సర్పంచ్ ఏనుగు జనార్దన్ రెడ్డి, మున్సిపాలిటీ మహిళా అధ్యక్షురాలు రమాదేవి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మహేష్ గౌడ్, దేవేందర్ గౌడ్, మున్సిపాలిటీ బిసి సెల్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జంగగళ్ళ శివకుమార్, శ్రీను చారి, జోగు బాలరాజ్, కరోళ్ళ లక్ష్మయ్య, బండి శ్రావణ్, నరసింహారెడ్డి, గణేష్, భాస్కర్ గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News