Sunday, July 7, 2024
HomeతెలంగాణSrinivas goud: తెలంగాణపై మోడీ విషం కక్కారు-మంత్రి

Srinivas goud: తెలంగాణపై మోడీ విషం కక్కారు-మంత్రి

తెలంగాణ ప్రజలకు మోడీ నమ్మక ద్రోహం చేశారు

ఎన్నికల ముందు విభజన హామీలు నెరవేరుస్తారని ప్రజలంతా ఆశించారని, తెలంగాణ ఉద్యమంలో అసలు బీజేపీ పాత్ర ఏంటని ..వెరసి విశ్వాస ఘాతకుడిగా మోడీ నిలిచారని నిప్పులు చెరిగారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. అద్వానీ లాంటి నాయకున్ని అణగదొక్కిన చరిత్ర మోడీదని, కోచ్ ఫ్యాక్టరీ పెట్టకుండా ఒక చిన్న రిపేర్ కంపెనీ పెట్టారని ఎద్దేవా చేశారు మంత్రి శ్రీనివాస్.

- Advertisement -

తెలంగాణ ప్రజలకు నమ్మకద్రోహం చేశారని, ఏపీలో ఏడు మండలాలు కలిపి తెలంగాణకు మోసం చేశారని, దేశానికి కరువొచ్చినా.. దేశానికి అన్నం పెట్టగలిగే స్థాయిలో తెలంగాణ ఉందని ఆయన గుర్తుచేశారు. మీరు పేర్లు మార్చి పెట్టుకున్న పథకాలు అన్నిటికీ తెలంగాణే కేంద్ర బిందువని ఎద్దేవా చేశారు మంత్రి. కర్ణాటకలో అత్యంత అవినీతి చేసింది మీ ప్రభుత్వమేనని ఆయన గుర్తుచేశారు, 80 కోట్ల బీసీలు మీరు ప్రధాని అయితే సంతోష పడ్డారని, కానీ బీసీ మంత్రిత్వ శాఖ లేని ప్రభుత్వం మీదని దెప్పి పొడిచారు. అవినీతి జరిగి ఉంటే ఇన్ని అద్భుత పథకాలు ఎలా వస్తాయో మోడీనే వివరించాలని సవాలు చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News