Sunday, July 7, 2024
HomeతెలంగాణSrinivas Goud: దక్షిణ కొరియా తరహాలో తెలంగాణలో పర్యాటకాభివృద్ధి

Srinivas Goud: దక్షిణ కొరియా తరహాలో తెలంగాణలో పర్యాటకాభివృద్ధి

దక్షిణ కొరియా లోని భారత అంబాసిడర్ తో మంత్రి భేటీ

శ్రీనివాస్ గౌడ్ దక్షిణ కొరియా పర్యటనలో రాజధాని సీయోల్ లో రిపబ్లిక్ ఆఫ్ కొరియా లోని ఇండియన్ అంబాసిడర్ అమిత్ కుమార్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు దక్షిణ కొరియాలో పర్యాటక, క్రీడా రంగాల్లో జరిగిన అభివృద్ధిపై చర్చించారు. దక్షిణ కొరియాలోనీ అమ్యూజ్మెంట్ పార్కులు, అడ్వెంచర్ టూరిజం, చిల్డ్రన్స్ పార్కుల అభివృద్ది తరహాలో హైదరాబాద్ లోనీ టాంక్ బండ్, బుద్వెల్, గండిపేట తదితర పర్యాటక ప్రాంతాల్లో ఏర్పాటు కు దక్షిణ కొరియా తరహాలో పర్యాటకాభివృద్ధి కోసం పూర్తి సహకారం అందిస్తామని రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ కి దక్షిణ కొరియా లోని భారత అంబాసిడర్ అమిత్ కుమార్ ఈ సమావేశంలో వెల్లడించారు.

- Advertisement -

CM కేసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి దక్షిణ కొరియా తరహాలో క్రీడా మైదానాలలో మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటుకు, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన సహకారం అందిస్తామని దక్షిణ కొరియాలోని భారత అంబాసిడర్ అమిత్ కుమార్ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ కి తెలిపారు.

ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News