బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)కు సుప్రీంకోర్టు(Suprem Court)నోటీసులు జారీ చేసింది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25వేల కోట్లు అవినీతికి పాల్పడిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ మహిళా నేత ఆత్రం సుగుణ ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలసులు కేటీఆర్పై కేసు నమోదు చేశారు.
దీంతో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసును క్వాష్ చేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సుగుణ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తాజాగా ఆమె పిటిషన్ పై జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం విచారణ జరిపింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది.
కాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రాజెక్టులో రూ.25వేల కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై గతేడాది అక్టోబరులో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేటీఆర్పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.