Tejeshwar Murder Case update:ఈ మధ్య కాలంలో కొంతమంది అమ్మాయిలు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే పెళ్లి చేసుకోవాలంటేనే అబ్బాయిలు భయపడిపోతున్నారు. మనసులో ఒకడిని పెట్టుకుని.. పైకేమో మరొకరిని పెళ్లి చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల బలవంతం కారణంగానో, ఆస్తి కొట్టేయేలన్నా కన్నింగ్ ఆలోచనతోనో పెళ్లి చేసుకున్న వెంటనే ప్రియుడితో కలిసి భర్తను నిర్దాక్షణ్యంగా చంపేస్తున్నారు. ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకూడదు.. లేదా ప్రియుడితో కలిసి పారిపోయి పెళ్లి చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఏకంగా చంపేయించడం ప్రస్తుత సమాజంలో మహిళల క్రూరత్వంను తెలియజేస్తుంది. ఇటీవల సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ మర్డర్ మరువక ముందే తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
జోగులాంబ గద్వాల జిల్లాలో హత్యకు గురైన సర్వేయర్ తేజేశ్వర్ కేసు కూడా ఇలాంటిదే. ఒకడితో అక్రమ సంబంధం పెట్టుకుని తేజేశ్వర్ ను పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిన నెల రోజులకే తన తల్లితో పాటు సంబంధం ఉన్న ఓ బ్యాంక్ మేనేజర్తో కలిసి భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేయించింది. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూడటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది.
అసలు ఏం జరిగిదంటే.. గద్వాల పట్టణంలోని గంటా వీధికి చెందిన తేజేశ్వర్ ప్రభుత్వ ప్రాజెక్టులు, వ్యవసాయ భూముల సర్వే పనులు చేసే సర్వేయర్ గా పనిచేస్తున్నాడు. అతడికి కర్నూలు జిల్లాకు చెందిన ఐశ్వర్యతో బంధువుల ద్వారా వివాహం నిశ్చయమైంది. అప్పటికే ఆమె ఓ బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఐశ్వర్య తల్లి సుజాత ఆ బ్యాంకులో స్వీపర్ గా పనిచేస్తూ తిరుమలరావుతో సంబంధం పెట్టుకుంది. అలా సుజాత ఇంటికి వచ్చే క్రమంలో ఆమె కుమార్త ఐశ్వరతోనూ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో తల్లి కుమార్తె ఇద్దరు తిరుమలరావుతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో ఐశ్వర్యకు గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్తో పెళ్లి నిశ్చయమైంది. తేజేశ్వర్తో పెళ్లి కుదిరినా కూడా తిరుమలరావుతో సంబంధం వదులుకోవడం ఐశ్వర్యకు ఇష్టం లేదు. దీంతో పెళ్లికి ఐదు రోజుల ముందు ఫిబ్రవరి 13న కనిపించకుండా పోయింది. ఆమె బ్యాంక్ మేనేజర్తో వెళ్లిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ అదే నెల 16న తిరిగి ఇంటికి వచ్చింది. వెంటనే తేజేశ్వర్కు ఫోన్ చేసి తనకు ఎవరితో సంబంధం లేదని తెలిపింది. కట్నం కోసం అమ్మ పడుతున్న బాధను చూడలేక ఫ్రెండ్ ఇంటికి వెళ్లానని చెప్పింది. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నానని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె మాటలకు కరిగిపోయిన తేజశ్వర్ పెళ్లికి ఒప్పుకున్నాడు.
అయితే అప్పటికే ఐశ్వర్య ప్రవర్తనపై అనుమానం ఉన్న తేజేశ్వర్ తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. అయినా కానీ వారి మాట వినకుండా మే18న ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన రెండు రోజులకే ఐశ్వర్య తన నిజస్వరూపం బయటపెట్టింది. తిరుమలరావుతో గంటల తరబడి ఫోన్ మాట్లాడుతుండేది. ఇది తెలిసిన తేజేశ్వర్ ఆమెను మందలించాడు. దాంతో తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ను చంపేయాలని ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, బ్యాంకు మేనేజర్ తిరుమలరావు డిసైడ్ అయ్యారు.
తిరుమలరావు కొంతమందికి సుపారీ ఇచ్చి హత్యకు పథకం రచించాడు. జూన్ 17న గద్వాలకు వచ్చి కర్నూలులో తాము 10 ఎకరాల పొలం కొంటున్నామని, దాన్ని సర్వే చేయాలని చెప్పి తేజేశ్వర్ను నమ్మించారు. కారులో ఎక్కించుకుని బయలుదేరారు. దారి మధ్యలో కారులోనే కత్తులతో దాడిచేసి గొంతుకోసి దారుణంగా చంపేశారు. అనంతరం మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు వద్ద పడేశారు. తేజేశ్వర్ కనిపించకపోవడంతో అతడి సోదరుడు గద్వాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు దర్యాప్తులో భాగంగా ఐదు రోజులకు తేజేశ్వర్ మృతదేహం పిన్నాపురం చెరువు వద్ద కర్నూలు జిల్లాలోని స్థానిక పోలీసులకు దొరికింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఐశ్వర్య, సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బ్యాంక్ మేనేజర్ పరారీలో ఉన్నాడు. హత్యలో పాల్గొన్న కొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా పెళ్లి అయిన తర్వాత ఐశ్వర్య కనీసం 2000 సార్లు బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతో ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. పరారీలో ఉన్న తిరుమలరావు, ఆయన కారు డ్రైవర్, సుపారీ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు.