Monday, September 23, 2024
HomeతెలంగాణTanduru: ఒక నిమిషం ఆలస్యం.. తొలి రోజే ఆరుగురు విద్యార్థులకు షాక్

Tanduru: ఒక నిమిషం ఆలస్యం.. తొలి రోజే ఆరుగురు విద్యార్థులకు షాక్

ఇంటర్మీడియట్ పరీక్షలలో ఒక నిమిషం ఆలస్యం అయిందని ఆరుగురు విద్యార్థులు పరీక్ష రాయకుండానే వెనుతిరిగారు. బుధవారం తాండూరు పట్టణంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని పలు జూనియర్ కళాశాలలో మార్చ్15వ తేదీ నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఒక నిమిషం ఆలస్యంగా చేరుకోవడంతో నిర్వాహకులు అనుమతించలేదు. విద్యార్థులు పరీక్ష రాయకుండా వెనుతిరిగారు.. తాండూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు నాగేందర్, కార్తీక్, ప్రశాంత్, నవ్యశ్రీ, చరణ్ , రమేష్ లు కన్నీళ్ల పర్యంతమౌతూ వెనుతిరిగారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News