Sunday, November 16, 2025
HomeతెలంగాణTanduru: శివ స్వాముల ఆశ్రమానికి మహేందర్ రెడ్డి 10 లక్షల విరాళం

Tanduru: శివ స్వాముల ఆశ్రమానికి మహేందర్ రెడ్డి 10 లక్షల విరాళం

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. వికారాబాద్ జిల్లా పాత తాండూరులోని శ్రీ కోటేశ్వర ఆలయానికి చెందిన శివ స్వాములు ఆశ్రమం కోసం విరాళాలు కావాల్సిందిగా ఎమ్మెల్సీ దృష్టికి విషయం తీసుకెళ్లారు. దీనిపై తక్షణం స్పందించిన పట్నం మహేందర్ రెడ్డి నూతన ఆశ్రమం కోసం శివ స్వాములకు రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. తాండూరు మండలం చంద్రవంచ గ్రామంలో పోచమ్మ ఆలయం అభివృద్ధి కోసం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఎమ్మెల్సీని అడిగిన వెంటనే ఆలయం అభివృద్ధికి తనవంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad