ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి. గత కొంతకాలంగా తీగల కుటుంబం కాంగ్రెస్ లోకి వస్తుందనే ప్రచారం బలంగా సాగుతుండగా ఆయన కూడా ఈ వార్తలను ఖండించలేదు. పైగా ఈరోజు స్వయంగా ఆయన, తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం ఇంట్లో భేటీ అయిన తీరు చూస్తుంటే మాత్రం తీగల కాంగ్రెస్ లోకి వచ్చేసినట్టే భావించవచ్చని రాజకీయ పండితులు అంటున్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/2f3252e4-3cf6-43ee-a767-ef42753abe0c-1024x661.jpg)