ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అసెంబ్లీలో తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్ (Telangana Budget) ప్రవేశపెట్టారు. రూ. 3,04, 965 కోట్లతో బడ్జెట్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా పేర్కొన్నారు.
శాఖల వారిగా కేటాయింపులు ఇలా..
వ్యవసాయశాఖ – రూ.24,439 కోట్లు
పశుసంవర్ధకం – రూ.1,674 కోట్లు
పౌరసరఫరాలశాఖ – రూ.5,734 కోట్లు
విద్యా రంగం – రూ.23,108 కోట్లు
కార్మికశాఖ – రూ.900 కోట్లు
పంచాయతీరాజ్ శాఖ – రూ.31,605 కోట్లు
మహిళా శిశుసంక్షేమశాఖ – రూ.2,862 కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ.40,232 కోట్లు
ఎస్టీ సంక్షేమం – రూ.17,169 కోట్లు
బీసీ సంక్షేమం – రూ.11,405 కోట్లు
చేనేత రంగం – రూ.371 కోట్లు
మైనార్టీ సంక్షేమం – రూ.3,591 కోట్లు
పరిశ్రమలు – రూ.3,527 కోట్లు
ఐటీ రంగం – రూ.774 కోట్లు
విద్యుత్ రంగం – రూ.21,221 కోట్లు
వైద్య రంగం – రూ.12,393 కోట్లు
పురపాలక రంగం – రూ.17,677 కోట్లు
నీటిపారుదల శాఖ – రూ.23,373 కోట్లు
రహదారులు, భవనాలశాఖ – రూ.5,907 కోట్లు
పర్యాటక రంగం – రూ.775 కోట్లు
క్రీడలు – రూ.465 కోట్లు
అటవీ, పర్యావరణం – రూ.1,023 కోట్లు
దేవాదాయశాఖ – రూ.190 కోట్లు
హోంశాఖ – రూ.10,188 కోట్లు