Thursday, June 12, 2025
HomeతెలంగాణTelangana Police: ఎంతటి ప్రముఖులైనా డ్రగ్స్ వాడితే వదలం.. పోలీసుల వార్నింగ్

Telangana Police: ఎంతటి ప్రముఖులైనా డ్రగ్స్ వాడితే వదలం.. పోలీసుల వార్నింగ్

ప్రముఖ సింగర్ మంగ్లీ (Mangali)బర్త్ డే పార్టీలో గంజాయి వినియోగంపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు తెలంగాణ పోలీస్(Telangana Police) ఎక్స్ ఖాతా వేదికగా వార్నింగ్ పోస్ట్ పెట్టారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న రిసార్ట్ పై చేవెళ్ల పోలీసులు దాడి చేశారని పేర్కొన్నారు. నింబధనలు పాటించకుండా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తామంటే పోలీసులు లాఠీ ఝుళిపించి గాడినపెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎంతటి ప్రముఖులైనా సరే డ్రగ్స్ లాంటి పదార్థాలు వాడితే కఠినచర్యలు తీసుకోవడానికి వెనుకాడని హెచ్చరికలు జారీ చేశారు.

కొంతకాలంగా శివారు ప్రాంతాల్లో క్లబ్బులుగా మారిన రిసార్టులలో అశ్లీల నృత్యాలు, విదేశీ మద్యం సరఫరా మీద పోలీసులు ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి చేవెళ్ల త్రిపుర రిసార్టులో అనుమతి లేకుండా ప్రముఖ సింగర్ బర్త్ డే వేడుకలు జరుగుతున్నాయని.. విదేశీ మద్యం, గంజాయి వాడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రిసార్ట్‌పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా విదేశీ మద్యం, గంజాయి సీజ్ చేశారు. పార్టీకి హాజరైన వారికి గంజాయి పరీక్షలు నిర్వహించగా.. అందులో 9 మందికి పాజిటివ్ వచ్చింది. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు రిసార్ట్ నిర్వాహకులతో పాటు, మంగ్లీపై కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా ఈ బర్త్ డే పార్టీలో సెలబ్రిటీలు దివి, కాసర్ల శ్యామ్.. తదితరులు ఉన్నట్లు గుర్తించారు.

తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో తనకంటూ సింగర్ మంగ్లీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమాల్లో పాటలు పాడే అవకాశం ఆమెకు దక్కింది. ఆమె పాడిన పాటలు సూపర్ హిట్ కావడంతో స్టార్ సింగర్ గా ఫేమ్ సంపాందించారు. న్యూస్ యాంకరింగ్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన మంగ్లీ ఆ తర్వాత ప్రైవేట్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయింది. ప్రధానంగా బోనాలు, శివరాత్రి పాటలు ద్వారా పేరు దక్కించుకుంది. ఈ సమయంలో ఇలాంటి బర్త్ వేడుకల ద్వారా చిక్కుల్లో పడింది. పద్థతిగా కనిపించే మంగ్లీ గంజాయి పార్టీ నిర్వహించడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News