Friday, May 30, 2025
HomeతెలంగాణKTR: కేటీఆర్‌ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత

KTR: కేటీఆర్‌ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ (KTR) క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఫొటో ఉండాలని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ఆఫీసులో సీఎం ఫొటో పెట్టేందుకు యత్నించారు. వారిని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరుపార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్‌ఎస్ శ్రేణులు నినాదాలు చేయగా.. మరోవైపు కేటీఆర్‌ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరు వర్గాలను చెదదరగొట్టారు.

- Advertisement -

ఇటీవల సిరిసిల్ల నియోజకవర్గంలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో పెట్టడం లేదని బీఆర్‌ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను కేటీఆర్‌ క్యాంప్ కార్యాలయంలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. సీఎం ఫోటోతో కేటీఆర్‌ క్యాంపు కార్యాలయంలో దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News