Monday, November 17, 2025
HomeతెలంగాణTG Assembly: అసెంబ్లీలో గందరగోళం.. స్పీకర్‌పైకి పేపర్లు విసిరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

TG Assembly: అసెంబ్లీలో గందరగోళం.. స్పీకర్‌పైకి పేపర్లు విసిరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ సభ్యులు నల్లని బ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. కేటీఆర్‌పై అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. అనంతరం ఫార్ములా ఈ-రేసుపై వాయిదా తీర్మానాన్ని అందజేశారు.

- Advertisement -

అయితే ఈ తీర్మానాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ తిరస్కరించారు. ఓ వ్యక్తికి సంబంధించిన విషయాలపై సభలో చర్చ జరగదని.. రాష్ట్ర ప్రయోజనాల గురించి సభలో చర్చించాలని తెలిపారు. అయినా కానీ ఫార్ములా ఈ-కారు రేసు అంశంపై సభలో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. ఈ క్రమంలో వారంతా పేపర్లు చించి స్పీకర్ వైపు గాల్లో ఎగురవేస్తూ.. ప్లకార్టులతో వెల్‌లోకి దూసుకొచ్చారు. దీంతో సభను 15 నిమిషాల పాటు స్పీకర్ వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad