Sunday, September 8, 2024
HomeతెలంగాణThalakondapalli: కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే ప్రజాపాలన

Thalakondapalli: కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే ప్రజాపాలన

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్..

ఇందిరమ్మ రాజ్యంలోనే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సబ్బండ వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లురవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీసింగ్, మాజీమంత్రి చిత్తరంజన్ దాసులు పేర్కొన్నారు.

- Advertisement -

తలకొండపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ అధ్యక్షతన మండలంలోని పడకల్, పెద్దూర్, తలకొండపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తలకొండపల్లి ముఖ్య కూడలి వివేకనంద విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో 10 ఏండ్లు పాటు నరకయాతన చూపిన కేసీఆర్ ప్రభుత్వ పాలనను గద్దెదించిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లో ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్న తీరును బిజెపి, బిఆర్ఎస్‌ పార్టీలు ఓర్వలేకపోతున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి డాక్టర్ మల్లురవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్, మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, పిసిసిసి సభ్యులు అయిల్ శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ, నాయకులు సతీష్ మాదిగ, ఇందిరా శోభ, కేశవరెడ్డి, భగవాన్ రెడ్డి, మోహన్ రెడ్డి, అంజయ్య గుప్త, రవీందర్, గుజ్జల మహేష్, వెంకటేశ్వర్ గౌడ్, వైస్ ఎంపిపి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపిపి లక్ష్మీదేవిరఘురాములు, శతాబ్ది టౌన్షిప్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచులు పయ్యావుల రమేష్ యాదవ్, శ్రీశైలం, మాజీ ఎంపిటిసి దాసరి యాదయ్య, కాంగ్రెస్ నాయకులు వెంకటయ్య, కృష్ణ, రమేష్, డెవిడ్, రాములు, లక్ష్మయ్య, రాజు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News