Saturday, September 7, 2024
HomeతెలంగాణThalakondapalli: కాంగ్రెస్ పార్టీ రాంపూర్ గ్రామ ఎమిటి ఎర్పాటు

Thalakondapalli: కాంగ్రెస్ పార్టీ రాంపూర్ గ్రామ ఎమిటి ఎర్పాటు

ఇంటింటికి ప్రచారం

కార్యకర్తలు, అభిమానులందరు సమష్టిగా కృషి చేయాలని తలకొండపల్లి మండల పార్టీ అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గ్రామ అధ్యక్షులుగా మాదు కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులుగా బోదాసు పెంటయ్య అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా కాకి లక్ష్మయ్య, కార్యదర్శులుగా స్వామి గౌడ్, కావలి మహేష్, హరీష్‌లను ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

- Advertisement -

పార్టీ గ్రామ సోషల్ మీడియా ఇంఛార్జ్ శ్రవణ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎండీ. అజ్జు మరియు పార్టీ సలహాదారులుగా హరి మోహన్ రెడ్డి, నరసింహ గౌడ్, పోగుల జంగయ్య, నిమ్మల నరసింహ, ఎం.అశోక్ రెడ్డి, ఎం అర్జున్ తదితరులను పార్టీ సలహాదారుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి నూతన కమిటీ సభ్యులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ అధ్యక్షులు మాధు కృష్ణారెడ్డి మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ పార్లమెంటు ఎన్నికల్లో మల్లురవి అత్యధిక మెజారిటీతో గెలుపే లక్ష్యంగా అందరం కలిసి మెలిసి సమష్టిగా పనిచేస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీ సంక్షేమం పథకాలను ఇంటింటికి ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. తదనంతరం నూతన కమిటీతో కలిసి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మండల అధ్యక్షుడు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డి,మాజీ ఎంపిటిసి తిక్కల వెంకటయ్య, నాయకులు కాకి కృష్ణ, వెంకట్ రెడ్డి, నరసింహ రెడ్డి, ప్రవీణ్, వేంకటేశ్, రమేష్, పర్వతాలు, కాకి శివ, జగదీష్, నందు, శ్రీశైలం తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News