Sunday, July 7, 2024
HomeతెలంగాణThangallapalli: చలివేంద్రంను ప్రారంభించిన కురుమ సంఘం మండల అధ్యక్షుడు

Thangallapalli: చలివేంద్రంను ప్రారంభించిన కురుమ సంఘం మండల అధ్యక్షుడు

ఉపాధి హామి కూలీలకు సేవ

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కురుమ సంఘం మండల అధ్యక్షుడు ఎగుర్ల కరుణాకర్ వారి తండ్రి క్రీ.శే. ఎగుర్ల ఎల్లయ్య స్మారకార్థం ఉపాధి హామీ పనులు జరిగే చెరువు వద్ద ఉపాధి హామీ కూలీలకు త్రాగు నీటి సదుపాయాన్ని కల్పించడానికి చలివేంద్రమును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నకొద్దీ కూలీలకు చల్లని నీరు అవసరమని భావించి ఆయన తండ్రి పేరు మీద చలివేంద్రం ప్రారంభించామని వెల్లడించారు. ఈ సందర్బంగా కరుణాకర్ కు ఉపాధి హామీ కూలీలు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఎగుర్ల ప్రశాంత్ ఫీల్డ్ అసిస్టెంట్ ఆకునూరి శ్రీనివాస్, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News