Monday, May 20, 2024
HomeతెలంగాణThangallapalli: కరీంనగర్ పార్లమెంట్ పక్కా కాంగ్రెస్ దే

Thangallapalli: కరీంనగర్ పార్లమెంట్ పక్కా కాంగ్రెస్ దే

మచ్చ శ్రీనివాస్ విశ్వాసం

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నేరేళ్ల నర్సింగం గౌడ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలను, బీడీ ప్యాకింగ్ కంపెనిలోని కార్మికులను కలిసిన కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు మచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఎంపి ఎలెక్షన్ లో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని ప్రజలు అంటుంటే మాలో మరింత ఉత్సాహం పెరుగుతుందని అన్నారు. ఉపాధి హామీ కూలీలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూలీ 50 రూ. పెంచే యోచనలో ఉందని హామీ ఇచ్చామన్నారు. కరీంనగర్ పార్లమెంట్ ఎలక్టన్లో కాంగ్రెస్ పార్టీ పక్కా జెండా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తంచేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆసాని సత్యనారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు పెద్దూరి తిరుపతి, మాజీ ఏఎంసీ చైర్మన్ లింగం రాణి, మాజీ వార్డు మెంబర్ రెడ్డి పర్షరాములు, సీనియర్ నాయకులు సుద్దాల కార్నాకర్, రాపెల్లి ఆనందం, సామల రమేష్, మోర లక్ష్మిరాజం, బండి పర్షరాములు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News