Sunday, July 7, 2024
HomeతెలంగాణThank you to KCR: దివ్యాంగులకు కొండంత అండ సీఎం కేసీఆర్ పాలన

Thank you to KCR: దివ్యాంగులకు కొండంత అండ సీఎం కేసీఆర్ పాలన

కేసీఆర్ పటానికి పాలాభిషేకం చేస్తూ బాణాసంచా కాలుస్తూ..

1000/- రూపాయలు పెన్షన్ పెంచుతూ జీవో విడుదల చేసిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల సంబరాలు.

- Advertisement -
  • రాష్ట్రంలో పెద్ద ఎత్తున కేసీఆర్ పటానికి పాలాభిషేకం మరియు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్న దివ్యాంగులు
  • సీఎం కేసీఆర్ కి రుణపడి ఉంటామని.. ఆనందం వ్యక్తం చేసిన దివ్యాంగులు
  • నేడు తెలంగాణ భవన్ లో పార్టీ ఆఫీస్ లో రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కే.వాసుదేవ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పటానికి పాలాభిషేకం, బాణసంచా కాల్చి సంబురాలు చేసిన దివ్యాంగుల
    పెన్షన్ల లబ్ధి దారులు.
  • ఈ సందర్బంగా చైర్మన్ వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ..
    భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో దివ్యాంగులకు అత్యధిక పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే. పెరుగుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా దివ్యాంగులకు ఇప్పటికే ఇస్తున్న 3,016/- పెన్షన్ మొత్తాన్ని మరో వెయ్యి రూపాయలు పెంచి 4,016/- రూపాయలు చేసినందుకు రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు సంబరాలు చేసుకుంటున్నారని, కేసీఆర్ దివ్యంగుల పాలిట దేవుడని భావిస్తున్నారని, అమ్మ అయినా సరే అడగకుండా అన్నం పెట్టదు.. అలాంటిది ఎలాంటి ధర్నా, దరఖాస్తు లేకుండానే దివ్యాంగుల అవసరాలు తెలుసుకొని సీఎం కేసీఆర్ వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతూ జీవో విడుదల చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ పటానికి పాలాభిషేకం చేస్తూ బాణాసంచా కాలుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నామన్నరు.

దివ్యాంగుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని, ఒకవైపు జీవనోపాధికి భరోసా కల్పిస్తూ మరోక వైపు ఆసరా పెన్షన్ రూపంలో వారి జీవితానికి ఆర్దిక భరోసా అందిస్తున్న సీఎం కేసీఆర్ కి రాష్ట్ర దివ్యాంగుల సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నమని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా గడిచిన తొమ్మిది ఏళ్లలో పదివేల కోట్లు ఖర్చుపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ ది అన్నారు. పెరిగిన ఆసరా పెన్షన్ రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షలకు పైగా లబ్ధి దారులైన దివ్యాంగులకు మరింత ఆర్థిక భరోసా అందిస్తుందని తెలిపారు.

సంపద పెంచుతా పేదలకు పంచుతా అన్న నినాదంతో రాష్ట్ర పాలన మొదలుపెట్టిన కేసీఆర్ ఆ క్రమంలో సబ్బండ వర్గాల సంక్షేమమే ద్వేయంగ పథకాల రూపంలో అన్ని వర్గాలకు ఆర్థిక లబ్ధిని అందజేస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. పెరిగిన పెన్షన్తో రాష్ట్ర ప్రభుత్వం మీద రూ. 616 కోట్లు భారం అవుతున్నప్పటికీ లెక్కచేయక దివ్యాంగుల కోసం పెన్షన్ పెంచిన గొప్ప మానవతావాది సీఎం కేసీఆర్ అన్నారు.

ఒక్క పెన్షన్లు కాకుండా మరోపక్క కార్పొరేషన్ ద్వారా ఉచితంగా సహాయ ఉపకరణాలు, సబ్సిడీ రుణాలు, నిరుద్యోగ వికలాంగులకు ఉచిత కోచింగ్ తో అండగా ఉంటున్నాం. మానవీయ పాలనకు నిలువెత్తు నిదర్శనమైన సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం నేను చైర్మన్ గా కొనసాగుతున్న సమయంలో పెన్షన్లు పెరగడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో దివ్యంగుల నాయకులు మున్నా, గుత్తికొండ కిరణ్, నల్గొండ శ్రీనివాస్ సుమన్, రాజ్యలక్ష్మి, కోమురెల్లి, వేణు, నాగరాజు, మనీ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News