Sunday, September 8, 2024
HomeతెలంగాణHyderabad: హైదరాబాద్‌లో ఐదు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు .. ఏ ప్రాంతాల్లో అంటే..?

Hyderabad: హైదరాబాద్‌లో ఐదు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు .. ఏ ప్రాంతాల్లో అంటే..?

Hyderabad: ఈనెల 26 నుంచి 30వ తేదీ వ‌ర‌కు హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్ష‌లు విధించారు. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఈ ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లోకి రానున్నాయి. రాష్ట్ర‌ప‌తి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా బొల్లారం, సోమాజిగూడ‌తో పాటు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో సోమ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల మ‌ధ్య ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉండ‌నున్నాయి.

- Advertisement -

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము సోమ‌వారం సాయంత్రం 4.15 గంట‌ల‌కు హైద‌రాబాద్‌కు చేరుకుంటారు. హ‌కీంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఆమె మైమానిక ద‌ళం శిక్ష‌ణ కేంద్రంలో సీఎం, గ‌వ‌ర్న‌ర్‌, ఇత‌ర ఉన్న‌తాధికారులతో భేటీ కానున్నారు. అనంత‌రం రాష్ట్ర‌ప‌తి నిల‌యానికి చేరుకుంటారు. గ‌వ‌ర్న‌ర్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు అధికారులు ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు చేశారు.

శీతాకాల విడిది సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి బొల్లారంలోని రాష్ట్ర‌ప‌తి నిల‌యంలో ఐదు రోజులు ఉంటారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ప్రాంతాల్లో ఆమె ప‌ర్య‌ట‌న ఉంటుంది. అయితే, రాష్ట్ర‌ప‌తి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా రేప‌టి నుంచి 30వ‌ర‌కు న‌గ‌రంలోని ప‌లు చోట్ల ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లోకి రానున్నాయి. 26న హ‌కీంపేట్‌, తిరుమ‌ల‌గిరి, కార్జానా, సికింద్రాబాద్ క్ల‌బ్‌, టివోలి, ప్లాజా, బేగంపేట్‌, రాజ్‌భ‌వ‌న్ రోడ్డు, సోమాజిగూడ మ‌ధ్య ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లోకి వ‌స్తాయి. ఈ ప్రాంతాల్లో వెళ్లే ప్ర‌జ‌లు షామీర్ పేట నుంచి మేడ్చ‌ల్ కు ఓఆర్ఆర్ ద్వారా ప్ర‌త్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాల‌ని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. కొంప‌ల్లి, సుచిత్ర‌, బోయిన్‌ప‌ల్లి, తాడ్‌బండ్, లీ రాయ‌ల్ ప్యాలెస్ మ‌ధ్య లేదా షామీర్‌పేట నుంచి బిట్స్‌, హైద‌రాబాద్ మార్గంలో కీస‌ర‌, ఘ‌ట్ కేస‌ర్, ఉప్ప‌ల్ కు వెళ్లాల‌ని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

కరీంనగర్ మార్గం ద్వారా వచ్చే ప్రయాణికులు జేబీఎస్-అల్వాల్ మార్గంలో రావొద్దని, దానికి ప్రత్యామ్నాయంగా ORR-మేడ్చల్ లేదా ఘట్‌కేసర్ ఎగ్జిట్ ద్వారా కొంపల్లి, ఉప్పల్‌కు చేరుకోవాలని సూచించారు. ఇక మంగళవారం హకీంపేట్, సికింద్రాబాద్ క్లబ్, టివోలి, ప్లాజా, సీటీఓ, ప్యారడైజ్, రాణిగంజ్, కర్బలా, ట్యాంక్ బండ్, లిబర్టీ, హిమాయత్ నగర్ వై జంక్షన్, నారాయణగూడ క్రాస్ రోడ్డు ప్రాంతాల మధ్య ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News