Sunday, July 7, 2024
HomeతెలంగాణKarimnagar: కరీంనగర్ చేరుకున్న టీటీడీ లడ్డు ప్రసాదం

Karimnagar: కరీంనగర్ చేరుకున్న టీటీడీ లడ్డు ప్రసాదం

స్వామివారి కళ్యాణం రోజున భక్తులకు లడ్డూ ప్రసాదం

జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహణలో కొనసాగుతున్న కరీంనగర్ మార్కెట్ రోడ్ శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 18వ తేదీన నిర్వహించనున్న స్వామి వారి కల్యాణోత్సవ కార్యక్రమానికి విచ్చేయనున్న భక్తులకు అందజేసే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని తీసుకురావడానికి 14వ తేదీన తిరుమల బయలుదేరిన బృందం గురువారం స్వామి వారిని దర్శనం చేసుకున్న అనంతరం కరీంనగర్ చేరుకున్నారు.

- Advertisement -

కరీంనగర్ కు చేరుకున్న లడ్డు ప్రసాద వాహనాన్ని ఆలయ అధికారులతో పాటు పలువురు నేతలు వైద్యుల అంజన్ కుమార్, కంకణాల అనిల్ కుమార్, తదితరుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఈవో కార్యాలయానికి తరలించారు.

ఎస్.ఆర్.కె డైరీ అధినేత బండారి మారుతి ఈ లడ్డులకు దాతగా వ్యవహరించగా వారి తరఫున విజయ్ కుమార్, రఘువీరారెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు వీర దేవేందర్, దొంతి గోపి, రాజు కుమార్, తదితరులు తిరుమల వెళ్ళిన బృందంలో ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News