Thursday, July 4, 2024
HomeతెలంగాణVaira: వైఎస్ జయంతికి బైక్ ర్యాలీ

Vaira: వైఎస్ జయంతికి బైక్ ర్యాలీ

పొంగులేటి శీనన్న ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

వైఎస్సాఆర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని వైరా పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. సుమారు వెయ్యి బైక్ లతో జై కాంగ్రెస్ జై పొంగులేటి నినాదాలతో ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా వైరా లోని వైఎస్సాఆర్ విగ్రహానికి పొంగులేటి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో పొంగులేటితో పాటు విజయబాయి, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, వైరా మున్సిపల్ ఛైర్మన్ సూతగాని జైపాల్, ధార్న రాజశేఖర్, చింతనిప్పు సుధాకర్, మిట్టపల్లి నాగి, పణితి సైదులు, మచ్చా రామారావు, తిరుపతి శ్రీను, లక్ష్మిబాయి, జాలాది రామకృష్ణ, కొల్లి రమేష్, ఉస్సేన్, రహీం, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News