Saturday, October 5, 2024
HomeతెలంగాణVanaparthi: లోక కళ్యాణార్థమే సుదర్శన మహా యాగం

Vanaparthi: లోక కళ్యాణార్థమే సుదర్శన మహా యాగం

ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని, లోక కళ్యాణార్థం సుదర్శన మహాయాగం కార్యక్రమం తలపెట్టినట్టు రిటైర్డ్ ఏఎస్పీ డాక్టర్ సర్వేశ్వర్ రెడ్డి చెప్పారు.  తాను ఏఎస్పీగా పదవి విరమణ చేసిన తర్వాత సామాజిక సేవలతో పాటు  ప్రజాసేవకు అంకితం కావడానికి నిర్ణయించుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగానే వనపర్తి జిల్లా కేంద్రంలో శుభకృత్ నామ ఉగాది పర్వదినంనాడు పద్మావతి శ్రీనివాస కళ్యాణ మండపంలో సుదర్శన మహాయాగం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపిస్తున్నట్టు తెలిపారు.  తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పది మంది వేద పండితుల చేతుల మీదుగా ఈ పవిత్ర కార్యక్రమం జరిపిస్తున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News