Wednesday, July 3, 2024
HomeతెలంగాణVemula: పేదలు, రైతులు కేసిఆర్ రెండు కండ్లు

Vemula: పేదలు, రైతులు కేసిఆర్ రెండు కండ్లు

పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా

కేసిఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అబివృద్దికి ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ కు చెందిన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు తీగల సంతోష్ అతని అనుచరులు హైదరాబాద్ లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు.

- Advertisement -

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు..

బాల్కొండ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ దయతో అన్ని విధాల అభివృద్ది చేసుకున్నామని మంత్రి అన్నారు. సాగునీటి రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు,మౌళిక సదుపాయాల కల్పన, మెరుగైన వైద్య సేవలు, బి.టి రోడ్లు, గ్రామాల్లో సి.సి రోడ్లు, సంక్షేమ పథకాలతో బాల్కొండ నియోజకవర్గం సుభిక్షం అయిందన్నారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఈ సందర్బంగా చెప్పారు.

కేసిఆర్ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ప్రపంచ స్థాయి ప్రశంసలు అందుతున్నాయని, అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఎదిగిందన్నారు. రోజు రోజుకు దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్ అభివృద్ది కావాలనే డిమాండ్
పెరుగుతోందన్నారు. “అబ్ కి బార్ కిసాన్ సర్కార్” అంటూ దేశ మార్పు కోసం బయలు దేరిన కేసిఆర్ కి ప్రజల్లోంచి విశేష మద్దతు లభిస్తోందని తెలిపారు. 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ వల్ల 10 ఏళ్లుగా పాలిస్తున్న బీజేపీ వల్ల పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. కేసిఆర్ నాయకత్వంలో పచ్చగున్న తెలంగాణ మీద బీజేపీ విషం చిమ్ముతుందని, కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఎవరెన్ని సర్కస్ ఫీట్లు వేసిన.. బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ గెలుపు ఖాయమని తేల్చి చెప్పారు. ఏది ఏమైనా కేసిఆర్ నాయకత్వమే దేశానికి, రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని మంత్రి వేముల పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల జడ్పీటిసి బద్ధం రవి, ఎంపిపి శివలింగు శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా, ఉపాధ్యక్షుడు సుభాష్, సుంకెట్ సర్పంచ్ కడారి శ్రీనివాస్, ఉప సర్పంచ్ పృధ్వీ, గ్రామ శాఖ అధ్యక్షుడు కె. పరమేష్, బిఆర్ఎస్ నాయకులు సందీప్, పిట్ల సత్యం, మాజి ఎంపిటిసి నవీన్, కడారి రవి, ఆరిఫ్, సుంకేట్ వార్డు సభ్యుడు ఓంకార్, సొసైటీ వైస్ చైర్మన్ చిరంజీవి, కే.చిన్న రాజన్న పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News