బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత(Kavitha)లో ఇంత ఆవేదన ఉందని ఇప్పుడే తెలిసిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Vinod Kumar) తెలిపారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తానని.. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ప్రకంపనలు సహజమని, చాలా పార్టీల్లో ఇలాంటి ప్రకంపనలు చూశామన్నారు. ఇలాంటి విషయాల్లో తమ పార్టీ మొదటిది కాదు.. చివరిది కాదని వ్యాఖ్యానించారు. బీజేపీతో పనిచేయాలనుకుంటే ఎప్పుడో పొత్తు పెట్టుకునేవాళ్లమని వినోద్ స్పష్టం చేశారు. చిట్చాట్లోని అంశాలపై షోకాజ్ నోటీస్ ఎలా ఇస్తామని పేర్కొన్నారు.
కాగా పార్టీలో తనకు కేసీఆర్(KCR) తప్ప మరెవరు బాస్లు కారని.. ఆయనొక్కడే బాస్ అని కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పార్టీలో కోవర్టులు ఉన్నారని.. వారితో చాలా ప్రమాదం పొంచి ఉందంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇంటి ఆడబిడ్డనే పెయిడ్ సోషల్ మీడియాతో విమర్శిస్తున్నారని ఆమె ఆరోపించారు