Friday, July 5, 2024
HomeతెలంగాణVithal Reddy: చచ్చిన కాంగ్రెస్కు ఓటేస్తే వృథా

Vithal Reddy: చచ్చిన కాంగ్రెస్కు ఓటేస్తే వృథా

కాంగ్రెస్ పార్టీని వీడిన ముఖ్య నేతలు

బషీరాబాద్ మండలం గ్రామంలో నవల్గా గ్రామంలో 200 మంది కార్యకర్తలతో వైసిపి రాష్ట్ర నాయకుడు రాఘవేందర్ రెడ్డి, మండల్ మాజీ వైస్ ఎంపీపీ బి.శంకర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రోహిత్ రెడ్డి తండ్రి విట్ఠల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా విట్టల్ రెడ్డి వీరిని పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. విట్టల్ రెడ్డి మాట్లాడుతూ.. 55 సంవత్సరం నుండి చెయ్యని అభివృద్ధి ఇప్పుడు ఏం చేస్తారు ఒకసారి అవకాశం అని తిరుగుతున్నారు వాళ్ళ గ్యారెంటీలు వాళ్లకే నమ్మకం లేదని మండిపడ్డారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తరువాత కాంగ్రెస్ పార్టీ సచ్చిపోయింది, సచ్చిపోయిన పార్టీకి ఓటు వేయొద్దని అన్నారు.

- Advertisement -

రోహిత్ రెడ్డి అంటే మన ఇంటి మనిషి వారికి ఓటేసి గెలిపించుకుందాం బయటి వారికి ఓటేస్తే మనం చచ్చినట్లే, చచ్చిపోయే పార్టీకి ఓటేస్తే ఓటు వృధా అవుతుంది. గెలిచే నాయకునికి ఓటేసి రోహిత్ రెడ్డిని గెలిపించుకుందాం. మన తాండూర్ లోకల్ రోహిత్ రెడ్డి అయినా మనకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారు. అటువంటి వారికి ఓటేసి గెలిపించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్తఫా, మునీందర్ రెడ్డి, రంగారెడ్డి, పాండు సౌకారి, భాను ప్రసాద్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఇసాక్, గ్రామ మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News