Saturday, September 28, 2024
HomeతెలంగాణVivekananda: వాటర్ వర్క్స్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

Vivekananda: వాటర్ వర్క్స్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

6 కోట్ల నిధులతో పనులు త్వరగా పూర్తి చేయాలి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ వాటర్ వర్క్స్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 6 కోట్ల నిధులతో మంజూరై మొదలు పెట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు, వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో రూ.16.70 కోట్ల నిధులను మంజూరు చేయించామన్నారు. వాటిని సద్వినియోగం చేసుకొని మిగిలిన పనులను త్వరగా ప్రారంభించి సకాలంలో పూర్తయ్యేలా చూడాలని, అధికారులందరూ ఒకరినొకరు సహకరించుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, అభివృద్ధి పనులలో ఎటువంటి నాణ్యత లోపం లేకుండా చూడాలని ఆదేశించారు. హెచ్ఎండబ్ల్యూఎస్ డీజీఎం విష్ణు ప్రసాద్, అప్పలనాయుడు, రాజేష్, మేనేజర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News