Thursday, April 10, 2025
HomeతెలంగాణWarangal: సజావుగా ధాన్యం కొనుగోలు

Warangal: సజావుగా ధాన్యం కొనుగోలు

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నట్టు, సంతృప్తికరంగా రైతులున్నట్టు మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయంగా తెలుసుకున్నారు. రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమంటూ, రైతు శ్రేయోభిలాషిగా సీఎం కేసీఆర్ అనే విషయాన్ని మంత్రులు గుర్తుచేశారు. తెలంగాణ సలహా ధాన్యం కొనుగోలు దేశంలో ఎక్కడా లేదని, రైతుల కోసమే ధాన్యం కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం అంటూ సింగిరెడ్డి, ఎర్రబెల్లి అన్నారు.

- Advertisement -

మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం అమ్మాపురంలో రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రులు నిరంజన్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావు, అక్కడి రైతులతో మాట్లాడారు. రైతుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అకాల వర్షాల వల్ల జరిగిన నష్టం తప్ప సమస్యలేమి లేవన్న రైతులు, ధాన్యం రవాణాకు సమయానుకూలంగా లారీలు వస్తున్నాయని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News