Sunday, October 6, 2024
HomeతెలంగాణWarangal: కేసీఆర్ ప్రధాని కావాలని ఎర్రబెల్లి ప్రత్యేక పూజలు

Warangal: కేసీఆర్ ప్రధాని కావాలని ఎర్రబెల్లి ప్రత్యేక పూజలు

మహాశివరాత్రి సందర్భంగా హనుమకొండలోని వేయి స్తంభాల గుడి రుద్రేశ్వరాలయం, వరంగల్ జిల్లా పర్వతగిరిలోని పర్వతాల శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరూరి రమేష్. సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని శివుడికి ప్రత్యేక పూజలు చేసినట్టు.. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే ఆలయాలకు మహర్ధశ వస్తోందన్నారు. యాదాద్రి, వేములవాడ, కొండగట్టును గత పాలకులు పట్టించుకోలేదని.. స్వరాష్ట్రంలో వందల కోట్లతో ఆలయాల అభివృద్ధి జరుగుతున్నాయన్నారు. నాటి కాకతీయుల స్ఫూర్తి తోనే నేడు దేవాలయాలకు పూర్వ వైభవాన్ని సీఎం కెసిఆర్ కల్పిస్తున్నారని ఎర్రబెల్లి వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News