Monday, November 17, 2025
HomeతెలంగాణYadadri: ఎల్లమ్మ గుడికి చిరుమర్తి లక్ష విరాళం

Yadadri: ఎల్లమ్మ గుడికి చిరుమర్తి లక్ష విరాళం

రామన్నపేట మండలంలోని బోగారం గ్రామంలో బొడ్రాయి, శ్రీ సీతారామచంద్ర స్వామి ధ్వజస్తంభం, శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్య అతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లమ్మ తల్లి దీవెనలు గ్రామ ప్రజలపై ఉండాలని కోరారు. దేవాలయాల అభివృద్ధికి తనవంతుగా 1,00,116/- (రూ.ఒక లక్ష నూట పదహారు రూపాయల) విరాళాన్ని దేవాలయ కమిటీకి ఆయన అందజేశారు. స్థానిక సర్పంచ్ అంతటి పద్మ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ కన్నే బోయిన జ్యోతి జెడ్పీటీసీ పున్న లక్ష్మి జగన్ మోహన్ ఎంపీటీసీ గోగు పద్మ మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమా రమేష్ పోషబోయిన మల్లేశం ఉప సర్పంచ్ జెళ్ళ శ్రీనివాస్ గుర్రం వెంకట రమణ గోగు వెంకట రమణ పబ్బు ధనంజయ తెల్సురి మల్లేశం బొడ్డుపల్లి లింగయ్య పంజల నరేష్ ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad