Sunday, October 6, 2024
HomeతెలంగాణYadadri: బంగారు ఆభరణాన్ని బహూకరించిన నిజాం కుటుంబం

Yadadri: బంగారు ఆభరణాన్ని బహూకరించిన నిజాం కుటుంబం

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం తరువాత మొదటిసారి శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించుచున్న సందర్భంగా నిజాం కుటుంబము తరపున ప్రిన్సెస్ బేగం సాహిబ ఎస్రా బిర్గన్ ఆదివారం బంగారు హారమును వైటిడిఏ వైస్ చైర్మన్ కిషన్ రావు ద్వారా ఆలయ కార్యనిర్వాహణాధికారి గీతకు ప్రధాన ఆలయంలో అందజేశారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణానికి మొదటగా ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి శ్రీ స్వామివారికి అలంకరించారు. 67 గ్రాముల బరువున్న ఈ హారం సుమారు నాలుగు లక్షల విలువ ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో దోర్బల భాస్కర శర్మ , ఆలయ అధికారులు సురేందర్ రెడ్డి, రఘు, అర్చకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News