Saturday, September 21, 2024
HomeతెలంగాణYennam: కాంగ్రెస్ కు అనుకూల పవనాలు

Yennam: కాంగ్రెస్ కు అనుకూల పవనాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయని, ప్రకృతి మనకు సహకరిస్తుంది అని మహబూబ్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హన్వాడ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని, బిఆర్ఎస్ పార్టీకి ప్రకృతి ప్రతికూలంగా మారింది అని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది అని ఆయన అన్నారు. ప్రజల కోసం కాంగ్రెస్ ఎప్పుడు పోరాటం చేస్తుందని, వారి భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా హన్వాడ మండలం, పుల్పవాని పల్లి, కొత్తపేట, ఇబ్రహీంబాద్, గ్రామాలకు చెందిన పలువురు బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ లు, వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

- Advertisement -


పుల్పవాని పల్లి బోడ ఆంజనేయులు, బొడ శేఖర్, పిచ్చకుంట్ల బాలయ్య, కొరమోని రవీందర్, మాజీ సర్పంచ్ ముస్టిపల్లి హన్మయ్య , 20 మంది బిఆర్ఎస్ కార్యకర్తలు, కొత్తపేట గ్రామం నుంచి మాజీ ఉప సర్పంచ్ కామారం పెద్దరాములు, దండోరా జిల్లా ఉపాధ్యక్షుడు కోమారం యాదయ్య తో పాటు15 మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఇబ్రహింబాద్ బిఆర్ఎస్ పార్టీ నుంచి కె.గోపాల్ రెడ్డి, పి. చెన్నారెడ్డి,ఎర్ర బాల కిష్టయ్య, 25 మంది బిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ నియోజకవర్గం అసెంబ్లీ కోఆర్డినేటర్ బెక్కరి మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ పి వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మారెపల్లి సురేందర్ రెడ్డి, టి. రాజేందర్ రెడ్డి , హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టంకర కృష్ణయ్య యాదవ్, ధర్మపూర్ శేఖర్ రెడ్డి, చంద్రశేఖర్, శేఖర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News