Sunday, September 22, 2024
Homeట్రేడింగ్Kothagudem: కొత్తగూడెంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 36వ షోరూం

Kothagudem: కొత్తగూడెంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 36వ షోరూం

జ్యోతి ప్రజ్వలన చేసిన నేహా శెట్టి, పాయల్ రాజ్ పుత్

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి 36వ షోరూం ఆదివారం కొత్తగూడెంలో ప్రారంభించారు. ఈ షోరూం- స్థానికంగా కొత్తగూడెంలోను, పరిసర ప్రాంత ప్రజల సరికొత్త జీవన శైలికి , వ్యక్తిగత అభిరుచులకు సరితూగేలా వారి షాపింగ్ అవసరాలను, వైవిధ్యభరిత వస్త్రాలను సాటిలేని నాణ్యతతో, సరసమైన ధరలకు విక్రయించటంతో పాటు అద్భుతమైన షాపింగ్ అనుభూతిని అందిస్తుందని నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -

కొత్తగూడెం స్థానిక ఎం.ఎల్.ఎ కూనమనేని సాంబశివరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కొత్తగూడెం పురపాలక సంఘ అధ్యక్షురాలు సీతామహాలక్ష్మి, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు కె. చంద్ర శేఖర రావు, విద్యానగర్ మాజీ సర్పంచ్ బానోత్ గోవింద్, చుంచిపల్లి మాజీ ఎంపీపీ బడావత్ సుగుణ ఆత్మీయ అతిథులుగా విచ్చేశారు.

సుప్రసిద్ధ తారామణులు కుమారి నేహా శెట్టి, కుమారి పాయల్ రాజ్ పుట్ దీప ప్రజ్వలనతో షోరూం ఆరంభానికి శ్రీకారం చుట్టారు. కొత్తగూడెం స్థానిక కస్టమర్స్ కు ఆరంభ ఆఫర్ గా అన్ని వస్త్రాలపై కాస్ట్-టు-కాస్ట్ సేల్ ను అందించారు.

36 వ షోరూం ఆవిష్కరణ తర్వాత కుమారి నేహా శెట్టి మాట్లాడుతూ షో రూమ్ లో అన్ని వయసుల, తరాల అభిరుచులకు సరితూగే విస్తృత శ్రేణికి చెందిన కలెక్షన్స్ లభ్యమవుతాయని, కొత్తగూడెంలోని సౌత్ ఇండియా షో రూమ్ ఆవిష్కరణలో భాగం కావడం ఆనందం గొలిపే అనుభవమన్నారు. వస్త్రాలంకరణకు సంబంధించి మంచి అభిరుచులు కలిగిన కొత్త గూడెం వాసులు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి ఈ సరికొత్త షా రూమ్ లో లభించే విస్తృత శ్రేణికి చెందిన వస్త్రాలతో రాబోయే పండగలు, వివాహ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, ఇక్కడ లభించే ఆఫర్ల ను వినియోగించుకుని, అనేక ప్రయోజనాలు పొందుతారని ఆశిస్తున్నానని అన్నారు. కుమారి పాయల్ రాజ్ పుట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తో చిరకాల అనుబంధాన్ని, అనేక పర్యాయాలు సందర్శించిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు. ఎప్పటి కప్పుడు మారే ఫ్యాషన్లను , విలాసవంతమైన పోకడలను దృష్టిలో ఉంచుకుని ఈ సంస్థ కస్టమర్లకు చేరువ కావటం లో ఎప్పుడూ ముందుంటుందన్నారు. వివాహం, పండగ, పూజ వేడుక సరిపోయే వెరైటీలు ఇక్కడ లభిస్తాయన్నారు. కొత్తగూడెం వస్త్రప్రియులు ఈ మాల్ ను తప్పక సందర్శించి, తమ అభిరుచులకు సరిపడే వస్త్ర శ్రేణిని కొనుగోలు చేయాలని ఆమె కోరారు.

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సంస్థ డైరెక్టర్ సురేశ్ శీర్ణ మీడియా వారితో మాట్లాడుతూ, శుభారంభానికి విచ్చేసిన ప్రముఖులకూ, పెద్దలకూ, సందర్శకులకూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అత్యుత్తమ షాపింగ్ అనుభూతిని అందించడంలో తమ అంకితభావాన్ని, నిబద్ధతను వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వస్త్రాభరణాల విషయంలో వినియోగ దారుల సంతృప్తి కి అగ్ర తాంబూలం ఇస్తామని, అందుకే వారి విశ్వసనీయతను చూరగొన్నామని, అదే తమ సంస్థ విజయ రహస్యమని అన్నారాయన. ముఖ్యంగా నాణ్యత, సరసమైన ధరల విషయంలో మొత్తం రిటైల్ పరిశ్రమలో అగ్రశ్రేణిలో ఉండటం తమకు గర్వకారణమని, అందుకు వస్త్ర ప్రియులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.

దసరా, దీపావళి వేడుకల సందర్భంగా అన్ని రకాల వెరైటీలపై పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ఇస్తున్నామని, వినియోగదారులు సంతోషంగా ముందుకు వచ్చి ఈ ఆఫర్లను వినియోగించుకోవాలని కోరారు. మరో డైరెక్టర్ అభినయ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పట్టు విభాగం లో లభించే వెరైటీల విస్తృత శ్రేణి గురించి వివరించారు. పట్టు గురించి అత్యంత అనుభవం , పరిజ్ఞానం , సేకరణ నైపుణ్యం కలిగిన తమ బృంద సభ్యులు భారతీయుల ఫ్యాషన్ ట్రెండ్స్ ని లోతుగా అధ్యయనం చేశారని, అటు సంప్రదాయాన్నీ, ఇటు ఆధునిక జీవన శైలిని మేళవించి.. కంచి , ధర్మవరం, ఆరణి, ఉప్పాడ, పోచంపల్లి, గద్వాల వెరైటీలను తమ షోరూమ్స్ లో అందుబాటులో ఉంచామన్నారు. మరో డైరెక్టర్ రాకేశ్ మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాలలో కొత్తగూడెం షో రూమ్ తాలూకు ప్రత్యేకత గురించి వివరించారు. ఎత్నిక్ మరియు బ్రాండెడ్ ఆప్షన్స్ విషయంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ముందుంటుందని అన్నారు. పురుషుల విభాగంలో తమ వద్ద విస్తృత శ్రేణికి చెందిన కలెక్షన్స్ ఉన్నాయని, కొత్తగూడెం వాసులు తప్పక సందర్శించి, కొనుగోలు చేయగలరని స్వాగతించారు.

డైరెక్టర్ కేశవ్ మాట్లాడుతూ తమ షో రూమ్ లోని చుడీదార్, లెహంగాలు లెగ్గిన్స్, గౌన్లు, కిడ్స్ వేర్, బ్రాండెడ్ లేడీ వేర్స్ లాంటి విస్తృతమైన వెరైటీలు ఇప్పటి ఫ్యాషన్స్ కు అనుగుణంగా రూపొందాయని, అభిరుచి కలిగిన మహిళా కస్టమర్లను స్వాగతిస్తున్నామని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News