Sunday, June 15, 2025
Homeనేషనల్Flight Accidents: అహ్మదాబాద్ ఘటనను తలపించే విమాన ప్రమాదాల గురించి మీకు తెలుసా..?

Flight Accidents: అహ్మదాబాద్ ఘటనను తలపించే విమాన ప్రమాదాల గురించి మీకు తెలుసా..?

Previous Plane Crashes: గుజరాత్‌లో జరిగిన విమాన ప్రమాదం ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఇది జరిగి రెండు రోజులు కావస్తున్నా దేశం ఇంకా కోలుకోలేకపోతోంది. గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌ లైనర్‌ విమానం.. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలి మంటల్లో కాలిపోయింది.

- Advertisement -

2025 జూన్ 12, మధ్యాహ్నం 1:38 గంటలకు అహ్మదాబాద్‌ రాజధాని అయిన సార్దార్ వల్లభ్భాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ గాట్విక్‌కి బయల్దేరింది Air India Flight AI‑171 (Boeing 787‑8 Dreamliner). కొన్ని సెకన్లపాటు ఎగిరి.. అలాగే ముందుకెళ్లి దగ్గరలోని మెడికల్ హాస్టల్ హాస్టల్‌ భవనాన్ని ఢీకొని పేలి పోయింది.ఈ దుర్ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోగా.. వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు ఫ్లైట్ సిబ్బంది, మరికొంతమెడికోలు కూడా ఈ ప్రమాదంలో మృతిచెందారు. మధ్యాహ్నం లంచ్ టైమ్ కావడంతో మెడికోలు అందరూ ఎయిర్‌పోర్టు సమీపంలోని హాస్టల్​ క్యాంటిన్​ హాల్‌ లోకి వచ్చి భోజనానికి సిద్ధం అవుతుండగానే.. ఫ్లైట్ వచ్చి హాస్టల్‌పై కూలింది. ఈ ప్రమాదంలో హాస్టల్ బిల్డింగ్ నేలమట్టమైంది. దీంతో 25 మందికి పైగా మెడికోలు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఇలాంటి ప్రమాదాలు ఇదివరకు కూడా జరిగాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

గతంలో జరిగిన విమాన ప్రమాదాలు:

  1. ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 605 (బెంగుళూరు)

తేదీ 14 ఫిబ్రవరి 1990న.. ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 605 బెంగుళూరులో ల్యాండింగ్ సమయంలో రన్‌వే దాటి కుప్పకూలింది. ఇందులో ప్రయాణిస్తున్న 92 మంది ప్రయాణికులలో.. మొత్తం 92 మంది దుర్మరణం చెందారు.

కారణం: పైలట్ తప్పిదం, ల్యాండింగ్ వ్యవస్థ లోపాలు.

  1. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 (కెనడా)

తేదీ 23 జూన్ 1985న ముంబయి నుంచి కెనడా వెళ్తున్న బోయింగ్ 747 విమానం, అట్లాంటిక్ మహాసముద్రంలో పేలుడు కారణంగా కూలిపోయింది. మొత్తం 329 మంది ఈ ఘటనలో తమ ప్రాణాలు కోల్పోయారు.

కారణం: ఉగ్రవాద చర్య, బాంబు పేలుడు.

  1. పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) ఫ్లైట్ PK-8303

తేదీ 22 మే 2020న లాహోర్ నుండి కరాచీకి వస్తున్న ఈ విమానం, రెండు ఇంజిన్లు ఫెయిలయ్యి నివాస ప్రాంతంలో కూలింది. మొత్తం 97 మంది మృతిచెందారు.

కారణం: పైలట్ తప్పిదం, టెక్నికల్ లోపాలు.

  1. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ 1344 (కేరళ)

తేదీ 7 ఆగస్టు 2020న దుబాయ్ నుండి కోజికోడ్ (కేరళ)కు వచ్చిన విమానం భారీ వర్షం కారణంగా రన్‌వే దాటి కూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు.

కారణం: తడి రన్‌వే, వాతావరణ పరిస్థితులు.

  1. మలేషియా ఎయిర్‌లైన్స్ MH370

తేదీ 8 మార్చి 2014న కౌలాలంపూర్ నుండి బీజింగ్‌కు వెళ్తున్న విమానం మధ్యలో కనిపించకుండా పోయింది. 239 మంది ప్రయాణికులున్న ఈ విమానం గాలిలోనే మాయమైంది.

కారణం: ఇప్పటికీ గుర్తించలేని మిస్టరీ.

ఈ ఘటనలు ప్రాణనష్టానికి ఉదాహరణలుగా మిగిలిపోవడమే కాక.. విమానయాన రంగానికి కీలకమైన పాఠాలు నేర్పాయి. ప్రతి ప్రమాదం తర్వాత.. భద్రతా ప్రమాణాలు బలపడ్డాయి. ప్రమాదాలు ఇకపై జరగకుండా.. కొత్త టెక్నాలజీలు ప్రవేశపెట్టబడ్డాయి. కానీ ఇప్పటికీ అవే పునరావృతం అవ్వడం శోచనీయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News