Indian Students in Iran: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. దీంతో కొందరు ఇరాన్లో నివసిస్తున్న విద్యార్థులు తమను తక్షణమే ఇక్కడి నుంచి ఇండియాకు తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు వాళ్లు పలు సామాజిక మాధ్యమాల్లో విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య వార్ తారాస్థాయికి చేరడంతో తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. ముఖ్యంగా ఇరాన్లో ఎక్కువగా మెడికల్ కోర్స్ చేస్తున్న విద్యార్థులు అధికంగా ఉన్నారు. ఎలాగైనా ఇక్కడి నుంచి తమను తీసుకెళ్లండి అంటూ కోరుతున్నారు.
బాంబుల దాడులతో గత మూడు రోజులుగా మేము నిద్రపోలేకపోతున్నామని ఇరాన్లోని షాహిద్ బెహేష్తీ యూనివర్సిటీలో చదువుతున్న ఓ భారతీయ విద్యార్థి ఇమ్తిసాల్ మొహిదిన్ తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు భారీ పేలుళ్లు వినిపించాయని.. ఆ వెంటనే సహాయం కోసం భవనం పై అంతస్తుకు పరుగెత్తినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇరాన్లో 350కి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారని ఆయన తెలిపారు. ప్రతి రోజు రాత్రి పేలుళ్లు శబ్ధంతో కంటిపై కునుకులేకుండా గడుపుతున్నట్లు తెలిపారు. ఇక ఇరాన్లోని మెడికల్ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇండియన్ ఎంబసీ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ముందుగా విద్యార్థులను ఇరాన్లోని సురక్షిత ప్రాంతాలకు తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. వీరందరినీ హాబిటేషన్ సెంటర్కి తరలించిన తర్వాత అవసరమైతే ఇండియాకు తీసుకవచ్చేందుకు మార్గాలను పరిశీలిస్తామని ఓ అధికారులు తెలిపారు.
ఇక భారత్లో నివాసం ఉంటున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు ఎంబసీలు చుట్టూ తిరుగుతున్నారు. ఎలాగైన తమ బిడ్డల్నీ కాపాడాలని వారు అధికారులను వేడుకుంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు కూడా జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు. తమ బిడ్డల్నీ క్షేమంగా మన దేశానికి రప్పించే ప్రయత్నాలు చేయలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.