Saturday, September 21, 2024
Homeపాలిటిక్స్కాంగ్రెస్ జీవవచ్చం, రాహుల్ గాంధీనీ తొలగిస్తేనే కాంగ్రెస్ కు సోయి లేదు

కాంగ్రెస్ జీవవచ్చం, రాహుల్ గాంధీనీ తొలగిస్తేనే కాంగ్రెస్ కు సోయి లేదు

దేశ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ (congress party) దాదాపు అంతరార్థం అయినట్లే నని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ పార్టీ నేత అధినేత రాహుల్ గాంధీని ( Rahul Gandhi) ఏకంగా పార్లమెంట్ నుండి తొలగిస్తే ఆ పార్టీకీ సోయి లేకుండా పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. అటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం జీవచ్చంలా మారింది అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అక్కరలేదన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్యస్ పార్టీ నిర్బహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలలో బాగంగా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని గుఱ్ఱంపోడు మండల కేంద్రంతో పాటు దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని పిఏ పల్లి మండలం అంగడిపేటలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

- Advertisement -

గుఱ్ఱంపోడులో జరిగిన సమ్మేళనానికి స్థానిక శాసనసభ్యులు నోముల భగత్, పిఏ పల్లి మండలం అంగడిపేటలో జరిగిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు, జిల్లా బి ఆర్ యస్ పార్టీ అధ్యక్షుడు నేనవత్ రవీంద్ర నాయక్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మోడీ దుర్మార్గాలను నిలువ రించేందుకే టి ఆర్ యస్ బి ఆర్ యస్ గా రూపాంతరం చెందిందన్నారు. యావత్ భారత దేశం ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం నిరీక్షిస్తుందన్నారు. మహారాష్ట్ర తో సహా యావత్ భారతదేశం లోనీ రైతాంగం,రైతు సంఘాల ప్రతినిధులు బి ఆర్ యస్ లో చేరేందుకు బారులు తీరుతున్నారన్నారు. ఇప్పటికే మోడీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలో విప్లవం రైతు మొదలైందని అది మధ్యప్రదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్ కు చేరుకొని అక్కడ తిరుగుబాటుకు శంఖారావం పురిస్తున్నారన్నారు. రైతు భీమా కోసం తెలంగాణా రాష్ట్రాన్ని ఆనుకొని ఉన్న సరిహద్దు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంద్రప్రదేశ్ లకు చెందిన రైతాంగం గుంట, అరగుంట భూములు కొనుగోలు చేయడం తో పాటు తెలంగాణా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ ను పొందేందుకు వీలుగా బోర్లు వేసుకుంటున్నారని ఆయన వెల్లడించారు. బిజెపి ఎలుబడిలో దేశంలో దారిద్య్రం విలయతాండవం చేస్తుందని ఆయన విమర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News