Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్KS Jawahar Reddy : ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా జ‌వ‌హ‌ర్ రెడ్డి నియామ‌కం

KS Jawahar Reddy : ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా జ‌వ‌హ‌ర్ రెడ్డి నియామ‌కం

KS Jawahar Reddy : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌లువురు ఐఏఎస్ అధికారులను బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. సీఎం స్పెష‌ల్ సీఎస్‌గా పూనం మాల‌కొండ‌య్య నియ‌మితుల‌య్యారు. వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్‌గా మధుసూదన్ రెడ్డి, వ్యవసాయ శాఖ కమిషనర్‌గా రాహుల్ పాండే, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్, ఆర్ అండ్ బీ సెక్రటరీగా ప్రద్యుమ్న, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా మహ్మద్ దివాన్‌లను నియ‌మించింది. ప్రస్తుతం సెలవుపై ఉన్న బుడితి రాజశేఖర్‌ తిరిగివచ్చిన తర్వాత జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

- Advertisement -

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి

ఏపీ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డిని నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌స్తుత సీఎస్ స‌మీర్ శ‌ర్మ ఈ నెల 30న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. డిసెంబ‌ర్ 1 నుంచి కొత్త సీఎస్‌గా జ‌వ‌హ‌ర్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. 1990 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి అయిన జవహర్ రెడ్డికి 2024 జూన్ వ‌ర‌కు స‌ర్వీసు ఉంది. దీంతో ఆయ‌న ఏడాదిన్న‌ర పాటు సీఎస్ పోస్టులో కొన‌సాగే అవ‌కాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News