Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Kollu Ravindra: బీసీల అభ్యున్నతి TDP తోనే సాధ్యం

Kollu Ravindra: బీసీల అభ్యున్నతి TDP తోనే సాధ్యం

రాష్ట్రములో అత్యధిక జనాభా గలిగిన బిసి సామజిక వర్గ ప్రజలకు న్యాయం చేసేది, వారి అభివృద్ధికి కృషి చేసే పార్టీ టీడీపీనే అని, బీసీల అభ్యున్నతి చంద్రబాబు పాలనతోనే సాధ్యమని టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
పట్టణంలో స్థానిక నంద్యాల బీసీ సంఘం అధ్యక్షులు కురుమూర్తి గృహంలో జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశమునకు ముఖ్య అతిథులుగా టిడిపి నాయకులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలపై రాష్ట్రంలో దాడులు విపరీతంగా పెరిగాయని అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. రాష్ట్రంలోనే బీసీల అభివృద్ధి అభ్యున్నతి పాటుపడిన ఏకైక పాలన నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక్కడే నన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీని ఆదరించాలని మరలా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం జిల్లా నాయకులు పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News