Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Bhuma Akhilapriya: నారా బ్రాహ్మణితో రాష్ట్రమంతా పర్యటిస్తాం

Bhuma Akhilapriya: నారా బ్రాహ్మణితో రాష్ట్రమంతా పర్యటిస్తాం

రాష్ట్రం బాగుండాలంటే టిడిపి అధికారంలోకి రావాలి

చంద్రబాబును అరెస్ట్ చేసి వైసీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. కర్నూలు టిడిపి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ
రాజన్న రాజ్యం వస్తుందని చెప్పి రాక్షస పాలన సాగిస్తున్నారన్నారు, ప్రతి జిల్లాలో ప్రజల నుంచి వైసీపీపై వ్యతిరేకత మొదలైందన్నారు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే అన్నిటిని అమ్మేస్తారని ప్రజలే అనుకుంటున్నారని ఆమె అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకులను కేసులు పెట్టి అరెస్టు చేస్తూ వేధిస్తున్నారన్నారు. పక్క రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది ఇక్కడ ఎం అభివృద్ధి జరిగిందో అందరూ చూస్తున్నారన్నారు. మాకు సీఐడీ క్లీన్ చిట్ అవసరం లేదు, దేశ, విదేశాల్లో ఉన్న వారు బాబుకు మద్దతగా నిలుస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఉద్యోగ గురించి అడుగుతే వాలంటరీలు చూపిస్తున్నారు. మిమ్మల్ని చూసి కంపెనీలు ఇక్కడికి రావడం లేదు. మేము శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే అరెస్టులు చేస్తున్నారు.ఓ మహిళ అని చూడకుండా అర్ధరాత్రి నన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారని పోలీసులకు సిగ్గు ఉందా అని అడుగుతున్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా మీడియాపై వైసీపీ నాయకులు దాడలు చేస్తున్నారన్నారు. నంద్యాలలో శాంతియుతంగా దీక్ష చేస్తుంటే, నా దీక్ష భగ్నం చేశారని నాకు పర్మిషన్ ఇచ్చి నా దీక్షను పోలీసులు భగ్నం చేశారన్నారు. నంద్యాల ఎస్పీపై, డిఎస్పీ, సీఐపై లీగల్ చర్యలు తీసుకుంటామన్నారు. ఆడ, మగా తేడా లేకుండా రాక్షస పాలన సాగిస్తున్నారన్నారు. చంద్రబాబు హోదాకు తగ్గటు చర్యలు తీసుకోకుండా హింసిస్తున్నారని, ఒక్క ఆధారం లేకుండా బాబును అరెస్ట్ చేసి, ఇప్పుడు లోకేష్ ని కూడా అరెస్ట్ చేస్తాం అంటున్నారన్నారు.

లోకేష్ ను అరెస్ట్ చేస్తే నారా బ్రాహ్మణి పాదయాత్ర చేస్తారని, నారా బ్రాహ్మణితో పాటు రాష్ట్రమంతా కలిసి నడుస్తామన్నారు. రాష్ట్రం బాగుండాలంటే టిడిపి అధికారంలోకి రావాలన్నారు. మేము ఎన్ని చేసిన ప్రజల కోసమే, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News