Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Mahindra group: ఏపీలో మహీంద్రా 7 స్టార్ హోటల్స్

Mahindra group: ఏపీలో మహీంద్రా 7 స్టార్ హోటల్స్

250 కోట్లతో ఒక్కొక్క హోటల్ నిర్మిస్తాం

సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన టెక్‌ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని.. తమ సంస్థ ఏపీలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో మూడు 5 స్టార్‌ నుంచి 7 స్టార్‌ హోటల్స్‌ నిర్మిస్తామన్నారు. ఒక్కో హోటల్‌ నిర్మాణానికి రూ. 250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎంకి వివరించిన మహీంద్ర గ్రూప్‌ ప్రతినిధులు.

- Advertisement -

ఏపీలో పర్యాటక రంగం అభివృద్దికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి మహీంద్ర గ్రూప్‌ ప్రతినిధులతో చర్చించారు సీఎం. విశాఖ సహా మరో 2 పర్యాటక ప్రాంతాల్లో స్టార్‌ హోటల్స్‌ నిర్మాణం చేపట్టనున్న మహీంద్ర గ్రూప్, వచ్చే 2 నెలల్లో శంకుస్ధాపనకు సమాయత్తమవుతున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో మహీంద్ర గ్రూప్‌ గ్లోబల్‌ హెడ్, అడ్మినిస్ట్రేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సీవీఎన్‌ వర్మ, క్లబ్‌ మహీంద్ర సీవోవో సంతోష్‌ రామన్, టెక్‌ మహీంద్ర విజయవాడ అడ్మిన్‌ మేనేజర్‌ బిరుదుగడ్డ జయపాల్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News