Friday, October 18, 2024
HomeతెలంగాణHyd: గిరిజన యూనివర్సిటీ కోసం మోడీకి పోస్ట్ కార్డ్స్ ఉద్యమం

Hyd: గిరిజన యూనివర్సిటీ కోసం మోడీకి పోస్ట్ కార్డ్స్ ఉద్యమం

మంత్రి కేటీఆర్ చేపట్టిన చేనేత పోస్ట్ కార్డ్స్ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని గన్ పార్క్ వద్ద గిరిజన రిజర్వేషన్ల కోసం ప్రధానికి పోస్ట్ కార్డ్స్ ఉద్యమాన్ని ప్రారంభించింది బీ.ఆర్.ఎస్. పార్టీ గిరిజన విద్యార్థి విభాగం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలోకి తీసుకుని వచ్చిన 10 శాతం గిరిజన రిజర్వేషన్లను వెంటనే ఆమోదించాలని, గిరిజన యూనివర్సిటీ వెంటనే ప్రారంభించాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పోస్ట్ కార్డ్స్ ఉద్యమాన్ని గిరిజన విద్యార్థులు సోమవారం హైదరాబాద్ గన్ పార్క్ వద్ద చేపట్టారు. గిరిజన రిజర్వేషన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరణ చేసి వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు.
ఇదే డిమాండ్ తో హైదరాబాద్ గన్ పార్కు వద్ద బీ.ఆర్.ఎస్. పార్టీ గిరిజన విద్యార్థి విభాగం నాయకులు దాడి శ్రీను నాయక్ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పోస్టు కార్డ్స్ ఉద్యమాన్ని చేపట్టారు. శ్రీను నాయక్, గిరిజనుల విద్యార్థులతో కలిసి పోస్ట్ కార్డ్స్ ఉద్యమాన్ని సోమవారం ప్రారంభించారు.

సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా 1,000మంది గిరిజన విద్యార్థులచే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి 1000 పోస్ట్ కార్డులను పంపుతామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉదృతం చేస్తూ ప్రతి కాలేజీ, స్కూల్, యూనివర్సిటీ విద్యార్థులను ఏకం చేస్తూ తమకు రావాల్సిన 10 శాతం గిరిజన రిజర్వేషన్లు, గిరిజన యూనివర్సిటీనిసాధించుకుంటామని గిరిజన విద్యార్థులు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News