Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్AP BRS: జోరందుకున్న బీఆర్ఎస్ లోకి చేరికలు

AP BRS: జోరందుకున్న బీఆర్ఎస్ లోకి చేరికలు

సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకి ఆదరణ పెరుగుతోంది …ఆంధ్రప్రదేశ్ బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర నాయకులు తలారి సురేష్ సారధ్యంలో హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో చేరికలు జరిగాయి. తాజాగా కాకినాడ జిల్లాకి చెందిన పి.సత్యనారాయణ (యూత్ కాంగ్రెస్ సంస్థ కార్యదర్శి ), అలాగే గుంటూరు BRS కార్యాలయంలో BRS నాయకులు షేక్ ఖాజావలి సారద్యంలో యర్రగొండుపాలెంకి చెందిన ధూపాటి చంద్రబాబు, విజయబాబు, అంబ్రిష్, బాల యేసు, సర్దక్ సహా జిల్లాకి చెందిన నాయకులు, కార్యకర్తలు BRSలో చేరారు. వారిని ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్ర శేఖర్ పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా తోట మాట్లాడుతు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఏపీలో ప్రజలు ఎవరు సంతృప్తిగా లేరని, రాష్ట్ర ప్రజలు మార్పు కోరుతున్నారని వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమం లో BRS రాష్ట్ర నాయకులు గిద్దా శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News