Sunday, April 13, 2025
Homeఆంధ్రప్రదేశ్Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణికి హైకోర్టులో షాక్

Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణికి హైకోర్టులో షాక్

మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్థన్ రెడ్డికి(Kakani Govardhan Reddy) హైకోర్టులో చుక్కెదురైంది. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు నమోదుచేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్​ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అలాకాగే ఈ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

- Advertisement -

కాగా ఈ కేసు నమోదైన నాటి నుంచి కాకాణి అజ్ఞాతంలో ఉన్నారు. విచారణకు హాజరు కావాలని మూడుసార్లు నోటీసులిచ్చినా ఆయన హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో కోర్టు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News