నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని ముత్యాలపాడు 2 సచివాలయం పరిధిలోని తోడెండ్లపల్లి గ్రామంలో ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బ్రిజేంద్రారెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి మండల అధ్యక్షుడు రామిశెట్టి వీరభద్రుడు, తోడెండ్లపల్లె సర్పంచ్ రామిశెట్టి గోవిందయ్య ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు భారీ ఎత్తున స్వాగతం పలికారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/09/2837a330-9249-4575-8e32-e68dfa6538ee-1024x576.jpg)
ఎమ్మెల్యే గంగుల నాని ప్రభుత్వం నుంచి అందే వివిధ పథకాల గురించి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు వారికి అందిన పథకాల వివరాలను వారికి బుక్లెట్స్ అందజేసి వారికి వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్ , మండల కన్వీనర్ కుమార్ రెడ్డి , వైఎస్సార్సీపీ పార్టీ మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/09/624d2151-055f-4c49-9529-c4f80cb53d4d-1024x461.jpg)