Saturday, July 27, 2024
Homeఆంధ్రప్రదేశ్Dhone: వైభవంగా బుగ్గన నామినేషన్

Dhone: వైభవంగా బుగ్గన నామినేషన్

బలపరిచిన ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి

నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైయస్సార్సీపి పార్టీ కార్యాలయంలో కులమతాలకు అతీతంగా పూజారి, మౌలానా, పాస్టర్, అన్ని కులాల వారితో ఆశీర్వాదం తీసుకొని ఆర్డివో ఆఫీస్ లో నామినేషన్ వేశారు. వైసీపీ అభ్యర్థి బుగ్గన్నకు ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి బలపరచారు, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లంపల్లి రామచంద్రుడు, మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు, 14వ వార్డు కౌన్సిలర్ దినేష్ గౌడ్, తదితరులు బుగ్గన్నతో నామినేషన్ లో పాల్గొన్నారు. తదనంతరం వైఎస్ఆర్సిపి కార్యాలయం నుండి పాత బస్టాండ్ గాంధీ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ నన్ను డోన్ నియోజకవర్గం ప్రజలు 2014 లో 2019 లో ఎమ్మెల్యేగా గెలిపించారు, అందుకు గాను డోన్ నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేసి చూపించాను. ఈ రాబోయే 2024 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించండి డోన్ నియోజకవర్గం నీ అభివృద్ధి బాటలో తీసుకొని వెళ్లడం నా బాధ్యత, అందుకుగాను మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా బుగ్గన్నను, ఎంపీ అభ్యర్థిగా పోచా బ్రహ్మానంద రెడ్డిని గెలిపించాలని వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో డోన్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు కౌన్సిలర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News