Saturday, July 27, 2024
HomeతెలంగాణKhammam: హెడ్ కానిస్టేబుల్ కుమార్తె రావూరి సాయి అలేఖ్యకు సన్మానం

Khammam: హెడ్ కానిస్టేబుల్ కుమార్తె రావూరి సాయి అలేఖ్యకు సన్మానం

సివిల్స్ ర్యాంకర్ కు సీపీ సన్మానం

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) పరీక్షల్లో 938వ ర్యాంక్ సాధించిన రావూరి అలేఖ్యను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సన్మానించారు. సమాజానికి సేవ చేయాలనే తపన, పట్టుదలతో ర్యాంకు సాధించిన అలేఖ్యతో పాటు తల్లిదండ్రులకు పోలీస్ కమిషనర్ స్వీట్లు పంచి అభినందించారు. మధిర టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న రావూరి ప్రకాశ్‌రావు, పద్మశ్రీ దంపతుల కుమార్తె అలేఖ్య ప్రాథమిక విద్య ఖమ్మంలోని త్రివేణి స్కూల్‌, తల్లాడ, నేలకొండపల్లి, కొత్తూరులోని ప్రైవేట్‌ స్కూళ్లలో పూర్తిచేశారు. తండ్రి ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో చదివిన ఆమె ఇంటర్మీడియట్‌ విజయవాడలోని శ్రీచైతన్య కాలేజీలో, ఉస్మానియా యూనివర్సిటీ బీఏ పూర్తిచేశాక వారణాసిలోని బెనారస్‌ యూనివర్సిటీ నుంచి రూరల్‌ డెవలప్‌మెంట్‌లో పీజీ చదివి గోల్డ్‌మెడల్‌ సాధించారు. అనంతరం హైదరాబాద్‌లో సివిల్స్‌ కోచింగ్‌ తీసుకున్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయం జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News