Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Vizag : బీచ్ రోడ్డులో మద్యం తాగుతూ.. పోలీసులపై యువతి వీరంగం, ఏఎస్ఐను కాలితో తన్ని..

Vizag : బీచ్ రోడ్డులో మద్యం తాగుతూ.. పోలీసులపై యువతి వీరంగం, ఏఎస్ఐను కాలితో తన్ని..

ఓ యువతి అర్థరాత్రి బహిరంగంగా మద్యం తాగుతూ విశాఖ బీచ్ రోడ్డులో వీరంగం సృష్టించింది. ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై విరుచుకుపడింది. పోలీస్ డిపార్ట్ మెంట్ అంతు చూస్తానంటూ దుర్భాషలాడింది. ఆమె తంతు చూసిన వారంతా.. అసలు ఆమె ఆడదేనా అని అవాక్కవుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో బీచ్ రోడ్డులోని వైఎంసీఏ సమీపంలో బైక్‌ వద్ద ఓ యువతి మద్యం తాగుతూ కనిపించింది. స్థానికులు.. ఏయ్ అమ్మాయ్.. నడిరోడ్డుపై ఇదేం పని అని ప్రశ్నించగా.. వాళ్లపై తిరగబడింది. దాంతో పోలీసులకు సమాచారమిచ్చారు.

- Advertisement -

పోలీసులు అక్కడికి చేరుకుని బహిరంగంగా మద్యం తాగకూడదని, వెంటనే వెళ్లిపోవాలని సూచించారు. పోలీసుల్ని చూసి.. ఎక్కడలేని ఆవేశంతో ఊగిపోయింది. నన్నే ప్రశ్నిస్తారా?.. నా ‘ఏటీఎం’కు చెప్పి మీ డిపార్ట్‌మెంట్ అంతు చూస్తానంటూ బూతులు తిడుతూ రెచ్చిపోయింది. అక్కడితే ఆగిందా ? ఏఎస్ఐ సత్యనారాయణను కాలితో తన్నింది. అక్కడున్న ఓ యువకుడు ఆమె ఆపేందుకు ప్రయత్నించగా.. బీరు సీసాతో గాయపరిచింది. దాదాపు గంటసేపు ఆ యువతి ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోయింది. ఆఖరికి మహిళ పోలీసులు రంగంలోకి దిగి.. స్థానికుల సాయంతో అదుపులోకి తీసుకుని, ఇంటివద్ద దిగబెట్టారు. ఆమెకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా 149 పాయింట్లుగా చూపించింది.

మర్నాడు ఉదయం ఆ యువతి ఇంటికెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను పాత డెయిరీఫామ్‌కు చెందిన ఎం.శ్రీలత (24)గా పోలీసులు గుర్తించారు. మద్యం తాగడానికి ముందు ఆమె గంజాయి కూడా తీసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. యువతిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, రిమాండ్ లో ఉంచారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News