Saturday, July 27, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: ఎమ్మిగనూరులో బాలయ్య టూర్ సక్సెస్

Emmiganuru: ఎమ్మిగనూరులో బాలయ్య టూర్ సక్సెస్

మంత్రాలయం ఫ్యాన్స్ నిరాశ

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మ రథం పట్టారు. ఎన్నికల ప్రచారంలో బాగంగా బాలకృష్ణ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటించారు. టిడిపి అభ్యర్థి బీవీ జయనాగేస్వర రెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షుడు పీ తిక్కారెడ్డి అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బాలకృష్ణ గోనెగండ్ల మండలం వేముగోడు గ్రామం నుండి పుట్టపాశం,హెచ్ కైరవాడి, గోనెగండ్లకు చేరుకుని ప్రసంగించారు.

- Advertisement -

ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి, ఎర్రకోట మీదుగా ఎమ్మిగనూరు కు చేరుకున్నారు. పట్టణంలోని గోనెగండ్ల రోడ్డు సర్కిల్ నుండి శివ సర్కిల్ ప్రసంగించారు. ముందుగా చెప్పిన రూట్ మ్యాప్ ప్రకారం కాకుండా లక్ష్మణ్ టాకీస్, వెంకట సాయి సర్కిల్ , ఎంజీ పెట్రోల్ బంక్ సర్కిల్, కరెంట్ ఆఫీసు మీదుగా కోసిగి వెళ్లారు. బాలకృష్ణకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు.

జై బాలయ్య, జై జై బాలయ్య, టిడిపి జిందాబాద్, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా మాజీ అధ్యక్షుడు, ఎంఎల్సీ బీటీ నాయుడు, టిడిపి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బస్తీపాటి నాగరాజు,ఎంపి డాక్టర్ సంజీవ్ కుమార్ పాల్గొన్నారు.

ఫ్యాన్స్ డిసప్పాయింట్..

మంత్రాలయంలో నందమూరి బాలకృష్ణ అభిమానులు నిరశ చెందారు. ఎమ్మిగనూరు నుంచీ మంత్రాలయం మీదుగా కొసిగి మండల కేంద్రంలో రొడ్దుషో కోసం మంగళవారం వచ్చారు. బాలకృష్ణ వస్తున్నారని తెలిసినా అభిమానులు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి కూడలిలో ఎదురు చూస్తున్నారు. అయితే కారులోంచి నమస్కారాలు చేస్తూ నేరుగా వెళ్ళిపోయారు. బాలకృష్ణను సన్మానించాలని టిడిపి మండల కన్వీనర్ పన్నగా స్వామీ, అశోక్ రెడ్డి, వరద రాజు తదితర నాయకులు , కార్యకర్తలు, అభిమానులు ఎదురు చూశారు. కానీ కారు ఆపకుండా వెళ్ళడంతో అందరూ నిరాశ చెందారు. బాలకృష్ణకు స్వాగతం పలకాలని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డి నాయకులతో కలసి వేచి ఉన్నారు. నేరుగా వెళ్ళిపోవడంతో అందరూ ఆయన్ను అనుసరించి వెళ్ళారు. కనీసం మంత్రాలయంలో ఆగి ప్రసంగించి ఉంటే బాగుండేదని అభిమానులు, నాయకులు ఎదురు చూశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News