Saturday, May 18, 2024
HomeతెలంగాణKarepalli: రామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్

Karepalli: రామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్

సీతారాముల ఆశీస్సులు నిండుగా లభించాలి

సకల గుణధాముడు, ఏకపత్నీవ్రతుడు, పితృవాక్ప రిపాలకుడు శ్రీరాముని జీవితం తరతరాలకు ఆదర్శప్రాయమని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏటా వసంత రుతువులో చైత్రశుద్ధ నవమి రోజు వైభవంగా జరిగే శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా శ్రీరామచంద్రుడు ఏనాడూ ధర్మాన్ని వీడలేదన్నారు. లోకకళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్రబంధం అజరామరమైనదని తెలిపారు. కష్టనష్టాల్లోనూ ఒకే మాట ఒకే బాటగా సాగిన జగదభిరాముడు మనందరికీ ఆదర్శప్రాయుడని. పుణ్య దంపతులు సీతారాముల కళ్యాణం ఈ లోకానికి పండుగ రోజని తెలియజేశారు. రామ‌రాజ్యం త‌ర‌హాలో మంచి పాల‌న అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి శ‌క్తిని ప్రసాదించాల‌ని, రాష్ట్ర ప్రభుత్వానికి రాముల వారి ఆశీస్సులు లభించాలని ప్రార్థించారు. వైరా నియోజకవర్గ ప్రజలందరికీ శుభాలు కలిగేలా శ్రీసీతారాముల ఆశీస్సులు నిండుగా లభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News