Tuesday, July 2, 2024
Homeఆంధ్రప్రదేశ్Heat wave: రేపు 23 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

Heat wave: రేపు 23 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. రేపు 23 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 330 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 16 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 264 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

- Advertisement -

రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (23) :-

అల్లూరి 6, బాపట్ల 1, తూర్పుగోదావరి 8, ఏలూరు7, కృష్ణా 1 మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

ఆదివారం విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 46°C,
కాకినాడ జిల్లా చేబ్రోలులో 45.9°C, మన్యం జిల్లా సాలూరు, శ్రీకాకుళం జిల్లా పొందూరులో 45.7°C, తూర్పుగోదావరి జిల్లా నందరాడలో 45.4°C, ప్రకాశం జిల్లా పట్చావలో 45.3°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 217 మండలాల్లో తీవ్రవడగాల్పులు,145 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు అక్కడక్కడ ఈదురగాలులతో కురిసే వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే కూలీలు, పుశు-గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News