Saturday, March 1, 2025
Homeఆంధ్రప్రదేశ్AP Budget 2025: బడ్జెట్‌లో ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారంటే..

AP Budget 2025: బడ్జెట్‌లో ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారంటే..

ఏపీ అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను(AP Budget 2025) ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3,22,359 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.2,51,162 కోట్లు రెవెన్యూ వ్యయంగా ప్రకటించింది. మూలధన వ్యయం రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా వెల్లడించింది.

- Advertisement -

ఈ బడ్జెట్‌లో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకంసై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ప్రతి రైతుకు రూ.20వేలు అందిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఊతమిస్తోందన్నారు. ముఖ్యంగా విద్య, నైపుణ్యాభివృద్ధి, బీసీ సంక్షేమం, ఎస్సీ-ఎస్టీ సంక్షేమం, మహిళా శిశు సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు.

ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారంటే..

బీసీల సంక్షేమానికి – రూ.47,456 కోట్లు,
ఎస్సీల సంక్షేమానికి – రూ.20,281 కోట్లు,
ఎస్టీల సంక్షేమానికి – రూ.8,159 కోట్లు,
అల్పసంఖ్యాక వర్గాల కోసం – రూ.5,434 కోట్లు,
మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి – రూ.4,332 కోట్లు,
నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు – రూ.1,228 కోట్లు
ఉన్నత విద్యకు – రూ.2,506 కోట్లు,
పాఠశాల విద్యాశాఖకు – రూ.31,805 కోట్లు,
వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి- రూ.19,264 కోట్లు
పంచాయతీ రాజ్‌ శాఖకు- రూ.18,847 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.13,862 కోట్లు
గృహ నిర్మాణ శాఖకు- రూ.6,318 కోట్లు
జలవనరుల శాఖకు- రూ.18,019 కోట్లు

తల్లికి వందనం- రూ.9,407 కోట్లు
ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు- రూ.27,518 కోట్లు
ఆర్టీజీఎస్‌ కోసం- రూ.101 కోట్లు
దీపం 2.0 పథకానికి- రూ.2,601 కోట్లు
మత్స్యకార భరోసాకు- రూ.450 కోట్లు
స్వచ్ఛాంధ్ర కోసం- రూ.820 కోట్లు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి- రూ.3,486 కోట్లు
ఆదరణ పథకానికి- రూ.1000 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్య శాఖకు- రూ.3,156 కోట్లు
ఇంధన శాఖకు- రూ.13,600 కోట్లు
ఆర్‌అండ్‌బీకి- రూ.8,785 కోట్లు
యువజన, పర్యటక, సాంస్కృతిక శాఖకు- రూ.469 కోట్లు
గృహ మంత్రిత్వ శాఖకు- రూ.8,570 కోట్లు
జల్‌ జీవన్‌ మిషన్‌ కోసం- రూ.2,800 కోట్లు
వ్యవసాయ అనుబంధ రంగాలకు -రూ.13,487 కోట్లు
పౌరసరఫరాల శాఖకు- రూ.3,806 కోట్లు
తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం- రూ.10 కోట్లు
నవోదయ 2.0 కార్యక్రమానికి- రూ.10 కోట్లు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News